‘కూచిపూడి వారి వీధి’ లో శ‌ర్వానంద్..

253
sharwanand Srikanth addla
- Advertisement -

కొత్త బంగారు లోకం సినిమాతో మంచి విజ‌యాన్ని సాధించాడు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌. వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన ఈచిత్రం యూత్ కు బాగా క‌నెక్ట్ అయింది. దాని త‌ర్వాత మ‌హేశ్ బాబు, వెంక‌టేశ్ ల‌తో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లే చెట్టు మ‌ల్టీస్టార‌ర్ తో మ‌రో విజ‌యం సాధించాడు. ఈ రెండు సినిమాలు భారీ విజాయ‌న్ని సొంతం చేసుకుకోవ‌డంతో మ‌రో ఫ్యామిలీ ఎంటటైన‌ర్ తో మ‌హేశ్ తో బ్ర‌హ్మాత్సవం అనే సినిమాను చేశాడు. ఈమూవీ బాక్సాఫిస్ వ‌ద్ద బొక్కాబొర్లాప‌డింది.అంతే కాకుండా మ‌హేశ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది.

srikanth addla

ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టును ఓకే చేయలేదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. చాలా రోజుల త‌ర్వా త మ‌రో సినిమా తీయడానికి సిద్ద‌మ‌య్యాడు. తాను రెడీ చేసిన డిఫ‌రెంట్ క‌థ‌ను హీరో శ‌ర్వానంద్ కు వినిపించాడ‌ట‌. దీంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట శ‌ర్వానంద్. త‌న ప్ర‌తి సినిమాకి వినూత్నంగా టైటిల్స్ ఉండేలా చూసుకునే శ్రీకాంత్ అడ్డాల త‌దుప‌రి సినిమాకి కూడా కాస్త కొత్త‌గా టైటిల్ ఉండేలా చూసుకుంటున్నాడ‌ట‌.

కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని వారు భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించ‌నున్నార‌ని టాక్. ఈమూవీలో ఇద్ద‌రు హీరోలు ఉండ‌నున్నార‌ని మ‌రో హీరో కోసం వెతుకుతున్నార‌ట ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌.

- Advertisement -