సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్లు అయిపోయిన విషయం తెలిసిందే. కూలీ పని చేసుకునే బేబీ ఇప్పుడు సింగర్ అయ్యింది. తాజాగా బేబీ కూడా ఓవర్ నైట్ సింగర్ అయిపోయింది. తను పాడిన ఓ చెలియా నా ప్రియ సఖియా అనే పాట సామాజిక మాధ్యమాలలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ కూడా ఆమె పాటకి పరవశించి ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం బేబి అమెరికా, దుబాక్ కి కూడా వెళ్లనుందని తెలుస్తుంది. అక్కడ బేబి పలు ఈవెంట్లలో పాటలు పాడడానికి ఆహ్వానించినట్టు సమాచారం. ఓ వ్యాపారవేత్త తాజాగా బేబిని సన్మానించి ఆమెకి రూ.1,11,111 (లక్ష 11వేల 111రూపాయలు) తో పాటు కొన్ని ఖరీదైన చీరలు ఇచ్చి సత్కరించారు. ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో కోటి, గాయని గీతామాధురి, కేథరిన్ థ్రెసా, హీరోయిన్ కారుణ్య (బంగారి బాలరాజు), నటి రంజిత, సింగర్ మధు తదితరులు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటివలే బేబీ ని ఇంటికి పిలిపించుకుని సన్మానించి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంగీత దర్శకుడు కోఠి వద్ద శిక్షణ తీసుకుంటున్న బేబి. డిసెంబర్ 5న ఎఆర్. రెహమాన్ ను కలవనుందట. చాలా మంది సెలబ్రెటీలు బేబికి సహాయం చేస్తున్నారు.