కోదండ సాక్షిగా కూటమి సమావేశం రసాభాస..

261
kodandaram
- Advertisement -

తెలంగాణ ప్రజాకూటమి నాయకుల మధ్య వివాదం మరోసారి బహిర్గతం అయింది. టీజేఎస్ చీఫ్ కోదండరాం సాక్షిగా కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత ఆకుట రాజేందర్ ఇంట్లో కోదండ నేతృత్వంలో కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ నేతలు సమావేశమయ్యారు. ప్రజాకూటమి తరపున పోటీ చేస్తున్న దిలీప్‌ పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిలీప్ తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని టీడీపీ నేత మండలి రాధాకృష్ణ యాదవ్ అతని అనుచరులు కోదండరామ్‌తో వాగ్వాదానికి దిగారు. తమను నిర్లక్ష్యం చేయడం సరికాదని మండిపడ్డారు. మా ఓట్లు కావాలి కానీ విలువ ఇవ్వరా అంటూ నిలదీశారు.

 congress akula rajender

టీడీపీ నేతల్ని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికి వారు మెత్తబడలేదు. ఈ క్రమంలో దిలీప్ జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో వివాదం సద్దుమణిగింది. మల్కాజ్‌గిరి నుండి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు రాధాకృష్ణ యాదవ్. ఈ నేపథ్యంలో దిలీప్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కోదండ సాక్షిగా తమ బాధను వెల్లగక్కారు టీడీపీ నేతలు.

- Advertisement -