యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈమూవీకి సుధీర్ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు అంతర్జాతీయ స్ధాయిలో పేరు రావడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దాదాపు రూ.200కోట్లతో సాహో సినిమాను తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈవీడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.భారీ యాక్షన్ చిత్రంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈసినిమా విడుదలపై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను 2019 ఆగస్ట్ 15 విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్ 15 విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.