వచ్చే ఏడాదికి ప్రిన్స్ “మహర్షి”

282
- Advertisement -

రంగస్థలం మూవీతో భారీ కొట్టిన సుకుమార్ అతి త్వరలోనే మహిర్షి సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు రానున్నాడు. ఇదివరకు ప్రిన్స్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం ప్రేక్షకుల నుంచి ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు తన 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో మహర్షి చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు ఫిల్మినగర్ టాక్. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా మహర్షి తెరకెక్కుతున్నట్లు సమాచారం.

వంశీ పైడిపల్లి చిత్రంతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మహేష్.. ఆ సినిమా పూర్తికాగానే సుకుమార్ తో కలిసి పని చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టిన దర్శకుడు వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులు, టెక్నిషియన్లను ఎంపిక చేసే పనుల్లో సుకుమార్ బిజీ అయ్యాడు.

1 నేనొక్కడినే చిత్రం ఆశించినంత లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఇక తాజాగా పిరియాడిక్ డ్రామాతో వస్తున్న మహిర్షి సినిమాపై ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అభిమానులను సంతృప్తి పరిచేందుకు హీరో మహేష్ తో పాటు సుకుమార్ కూడా మూవీ మెకింగ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -