ఆ వార్తలలో నిజం లేదు-గోపీచంద్

368
gopichand
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు గోపీచంద్. చిత్రపరిశ్రమలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి..యాక్షన్ హీరోగా ఎదిగారు. తాజాగా పంతం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి. థియేటర్లలో సందడి చేస్తున్నారు. మరోసారి యాక్షన్ హీరోగా మెప్పించారు. అయితే గత కొంత కాలంగా గోపీచంద్ సినిమాలు సక్సెస్ ట్రాక్ నుంచి తప్పుకున్నాయి. సాహసం తర్వాత, ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టులేక పోయాయి. దీంతో మళ్లీ విలన్ పాత్రలో నటించేందుకు సిద్దమవుతున్నారని ఫిలింనగర్ టాక్ వినిపిస్తోంది.

Gopichand-

విలన్ గా చేస్తూనే, కథానాయకుడిగా కొనసాగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై గోపీచంద్ మాట్లాడుతూ.. నేను విలన్ గా చేస్తానని వస్తున్న వార్తలలో నిజం లేదని, తనకు ఇప్పట్లో విలన్‌ పాత్రలో నటించాలనే ఆలోచన లేదని చెప్పారు. మరో రెండు ప్రాజెక్టులు కథానాయకుడిగా చేయడానికి సిద్దంగా ఉన్నాయని, సంపత్ నందితో ఒక సినిమా చేయనున్నానని, అలాగే కొత్త దర్శకుడు కుమార్ తో మరో సినిమా చేయనున్నాని చెప్పుకొచ్చారు.

- Advertisement -