‘మహానటి’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..

263
Jaya prakash narayana tweet on mahanati movie..
- Advertisement -

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన తాజా చిత్రం ‘మహానటి’. ఈ సినిమా బుధవారం విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. కీర్తి సురేష్‌ టైటిల్ రోల్ పోషించగా సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు సీనియర్ నటీనటుల పాత్రలో నటించి మెప్పించారు.

Jaya prakash narayana tweet on mahanati movie..

వైజయంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖు నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీని చూసిన లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ  ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్‌ తెరకెక్కించారని, మహానటి సావిత్రిని ఈ సినిమాలో అద్భుతంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించారన్నారు. ఈ సినిమాలోని నటీనటులు, తెర వెనుక పనిచేసిన బృందం పని తీరుకు నిదర్శనమన్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి సావిత్రిని మళ్లీ గుర్తుకు తెచ్చారు. కన్నీరు ఆపుకోవడం కష్టం. కీర్తి సురేశ్‌, సమంత అద్భుతమైన నటను కనబరిచారు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -