డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కతున్న చిత్రం మెహబూబా. తన సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్లో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే 1971 నాటి ఇండియా పాకిస్తా్న్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో జరిగిన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో వస్తుండటం విశేషం. పూరికి చాలా రోజుల నుంచి సరైన హిట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. ఎలాగైన ఈ సినిమాతో మంచి హిట్ కొట్టే పనిలో పడ్డాడు పూరి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక విషయమేమిటంటే ఈ సినిమా విడుదల కాకముందే ఆకాష్ పూరీతో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది. ఆకాష్ కోసం అప్పుడే ఓ కథను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే తదుపరి తాను చేయబోయే సినిమా కథ మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సినిమాను కూడా తన సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్ల్లోనే నిర్మిస్తున్నారట. మొత్తానికి ఆకాష్ పూరితో మారో సినిమా కాన్ఫార్మ్ అయిన పూరి ఇక హీరోల కోసం వేతికే పని లేకుండా పోయిందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.