‘రంగస్థలం’ సీక్వెల్ ఆలోచనలో సుక్కు..

361
- Advertisement -

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఒక విభిన్నమైన సినిమా కావడం, చెవిటి వాడిగా హీరో క్యారెక్టరైజేషన్, కథలోని భావోద్వేగాలు,1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తున్నాయి.

Sukumar opens up about “Rangasthalam” sequel

అయితే చరణ్ ఇంతవరకూ చేసిన సినిమాలకి ఇది భిన్నమని ప్రేక్షకులు అంటున్నారు. సుకుమార్ ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఇది ప్రత్యేకమని చెబుతున్నారు. ‘చిట్టిబాబు’ పాత్రలో చరణ్ జీవించాడనీ, తెరపై ఈ పాత్ర తప్ప చరణ్ కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరు అపూర్వమని కితాబునిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వులో మాట్లాడిన సుకుమార్.. జనానికి ఇంతగా దగ్గరైన చిట్టిబాబు పాత్రను ఇంతటితోనే వదిలేయదలచుకోలేదని చెప్పాడు. ఈ పాత్రను కొనసాగించే ఆలోచన చేస్తున్నానంటూ సీక్వెల్ గురించిన ఆలోచనను బయటపెట్టాడు. సీక్వెల్ చేస్తే అందులో చిట్టిబాబును కొత్తగా చూపిస్తాననీ, చెవికి ఆపరేషన్ చేయించుకుని మాటలు వినగలిగే చిట్టిబాబును చూస్తారని చెప్పాడు. మరి ఈ సీక్వెల్‌ ఎప్పుడు వస్తుందో చూడాలి.

- Advertisement -