ప్రియా వారియర్ గురించి..సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పిల్ల ఒక్కసారి కన్నుకొట్టగానే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ప్రియా నటిస్తున్న ఓ మళయాల చిత్రంలోని ఓ వీడియోని చిత్రటీం రిలీజ్ చేసింది. అందులో ప్రియా వారియర్ ఇచ్చిన హావభావాలు యూత్ హృదయాల్ని కుదిపేసింది. అంతేకాదు టాలీవుడ్ ,బాలీవుడ్ సెలెబ్రెటీలు సైతం ప్రియా కన్నుకొడితే డమాల్న పడిపోయారు.
ఈ క్రమంలోనే ప్రియాకి ఆఫర్లవెల్లువ మొదలైంది. అయితే ఇంతటి ఫాలోయింగ్ ని సంపాధించకున్న ప్రయా వారియర్కి తాజాగా ‘ఫిదా’ పిల్ల సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చింది. కారణమేంటంటే..ప్రయాకి వరుస ఆఫర్లు రావడమే.
అందుకే..స్టార్డమ్ రావడం కంటే..దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టమని, ఛాన్సులొస్తున్నాయ్కదా అని అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తప్పవని చెప్తోంది సాయిపల్లవి. పారితోషికం గురించి ఆలోచించకుండా ఇకమీదట మరింత శ్రద్దతో సినిమాలకు కమిట్ అవ్వాలని సూచిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే..తనలాగే కెరియర్ పరంగా జగ్రత్తలు తీసుకోవాలంటూ హితవు పలుకుతోంది సాయిపల్లవి.
ఇక ఇదిలాఉంటే..ప్రయా నటిస్తున్న ఫస్ట్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాతే మిగతా సినిమాల గురించి, పారితోషికం గురించి ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ కెరళబేబీ.