ఏపీ కేబినెట్‌ కు బీజేపీ మంత్రుల రాం.. రాం

187
ap bjp
- Advertisement -

ఏపీ బీజేపీ మంత్రులు పైడికొండల మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు గురువారం ఉదయం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ రాజీనామా పత్రాలను అందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాలు చేసిన బీజేపీ మంత్రులకు టీడీపీ మంత్రులు ఆలింగనాలతో వీడ్కోలు పలికారు.

ap bjp

ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాణిక్యాల రావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి మూడు నిమిషాల్లో బయటకు వచ్చారు. కామినేని శ్రీనివాస రావు మాత్రం రాజీనామా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చాంబర్‌లో కాసేపు ఉన్నారు.తాను పదవి నుంచి తప్పుకుంటున్నందుకు ఎలాంటి బాధ లేదని కామినేని శ్రీనివాస రావు చెప్పారు. పదవుల నుంచి గౌరవంగా తప్పుకోవడం సంతోషకరమని చెప్పారు.

- Advertisement -