వేలానికి…శ్రీదేవి వేసిన పెయింటింగ్‌

228
Sridevi made Sonam Kapoor's painting ....
- Advertisement -

దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి వేసిన పెయింటింగ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆమె వేసిన వేసిన సోనమ్ కపూర్ బొమ్మ పెయింటింగ్‌ను దుబాయ్‌లో వేలానికి పెట్టునున్నారు.

శ్రీదేవి అమితంగా ఇష్టపడే పాప్‌ ప్రపంచపు రారాజు మైకేల్‌ జాక్సన్‌ బొమ్మ పెయింటింగ్‌‌ను కూడా ఆమె వేశారు. సోనమ్ కపూర్ పెయింటింగ్‌తో పాటు మైకేల్ జాక్సన్ పెయింటింగ్‌ను కూడా త్వరలో దుబాయ్‌లో వేలానికి పెట్టనున్నారు. అయితే ఈ రెండు పెయింటింగ్‌లలో మైకేల్ జాక్సన్ పెయింట్‌ను మాత్రం రూ.8 లక్షల నుంచి వేలానికి పెట్టనున్నారు.

 Sridevi made Sonam Kapoor's painting ....

శ్రీదేవి వేసిన పెయింటింగ్‌లను దుబాయ్‌లో వేలం వేసేందుకు అక్కడే ఉంచినట్టు ఓ జాతీయ మీడియా నివేదించింది. ఎన్నో ఏళ్లుగా ఖాళీ సమయం దొరికినప్పుడుల్లా శ్రీదేవి పెయింటింగ్‌లు వేస్తుండేవారు. 2010లో అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ ఆమెను సంప్రదించి.. శ్రీదేవి వేసిన పెయింటింగ్‌లను వేలానికి పెట్టాల్సిందిగా కోరింది. కానీ, శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు. సోనమ్ కపూర్‌కు దుబాయ్‌లో మాస్ ఫాలోంయింగ్ బాగా ఉంది.

ఈ నేపథ్యంలో శ్రీదేవి గీసిన సోనమ్ పెయింటింగ్.. వేలంలో భారీ స్థాయిలో అమ్మడువుతుందని బిడ్డర్స్ ఆశిస్తున్నట్టు మిడ్ డే నివేదించింది. కాగా, ఇటీవల దుబాయ్‌లోని తన మేనల్లుడి పెళ్లికి వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్ టబ్‌లో జారిపడి మృతిచెందిన సంగతి తెలిసిందే.

- Advertisement -