జస్ట్‌ నాలుగు రోజులు ఓపికపట్టండి- రజిని

192
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాలు. ఈ తమిళ తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కి కొన్ని సూచనలు చేశారు రజినికాంత్‌.

అసలు రజిని రాజకీయాల్లోకి వస్తారా ..? లేదా..? అనే అయోమయంలో ఉన్న అభిమాలనులతో మరోసారి సమావేశాలు నిర్వహిస్తున్నాడు రజిని. ఈ క్రమంలోనే… తాను పదే పదే ఒకే విషయాన్ని చెబుతున్నానని ఎవరూ అన్యధా భావించవద్దని, తొలుత కుటుంబం, ఆ తరువాతే మరెవరి గురించైనా ఆలోచించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

 Just wait for 4 days: Rajinikanth on his big announcement

మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని, తాను అన్ని విషయాలూ చెబుతానని అన్నారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఎంతో ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల పిల్లలే ఆస్తి అని, వారిని బాగా చదివించుకోవాలని, జీవించి ఉన్న దైవాలుగా తల్లిదండ్రులను గౌరవించాలని ఫ్యాన్స్ కు సలహా ఇచ్చారు. చూడాలి మరి, మరో నాలుగు రోజుల్లో రజిని నోట ఎలాంటి మాటలు వస్తాయో..

- Advertisement -