స్వైన్ ఫ్లూతో ఆస్పత్రిలో చేరితే..!

1
- Advertisement -

ఢిల్లీకి చెందిన 41 ఏళ్ల మేఘా గార్గ్ అనే గృహిణికి స్వైన్ ఫ్లూతో ఆస్పత్రిలో చేరితే ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసింది. స్వైన్ ఫ్లూ తో ఆమె పరిస్థితి విషమించి ఐసీయూలో చేరాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆమెకు తీవ్రమైన డయాబెటిస్ ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. చాలామందికి తమ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయనే విషయం తెలియదు. వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు మాత్రమే ఇది బయటపడుతుంది.

సైలెంట్‌గా ఉండే డయాబెటిస్ ఉన్న రోగులకు స్వైన్ ఫ్లూ లేదా ఇతర ఫ్లూ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.డయాబెటిస్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఇన్‌ఫ్లుఎంజా వైరస్ శరీరంలో వేగంగా విస్తరించి రోగిని ఐసీయూ వరకు తీసుకెళ్తుంది.

వైద్యుల హెచ్చరిక: 30 లేదా 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా సాధారణ హెల్త్ చెకప్‌లు (బ్లడ్ షుగర్ పరీక్షలు) చేయించుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌ను ముందుగానే గుర్తిస్తే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు.

Also Read:‘మైసా’..రిలీజ్ డేట్ ఖరారు!

- Advertisement -