హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు పరిధిలోని అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం రంగనాథ్కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని? హైడ్రా కూల్చివేతలు ఎన్నో నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు సూచించింది న్యాయస్థానం. హైడ్రా చర్యలతో ఇతర అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుంది.. అధికారుల చర్యలతో కోర్టు విలువైన సమయం వృథా అవుతుంది.
Also Read:రక్తం గడ్డకట్టడం..అవగాహన!
మేడ్చల్లోని వాణి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో కూల్చివేతలపై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేయగా తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు.

