కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారుల బృందం పతకాల వేటను వేగవంతం చేసింది. పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించడం ద్వారా మురళీ శ్రీశంకర్ భారతదేశ పతకాల సంఖ్యను పెంచారు. 27 ఏళ్ల శ్రీశంకర్ తృటిలో మొదటి స్థానాన్ని చేజార్చుకున్నప్పటికీ ఈ ఈవెంట్లో తన వెండి పతకాన్ని విజయవంతంగా నిలబెట్టుకోగలిగారు.
శ్రీశంకర్ తన ఆరు ప్రయత్నాలలో రెండవ ప్రయత్నంలో 8.09 మీటర్ల దూరాన్ని నమోదు చేయడం గమనార్హం. రెండు సార్లు ఫౌల్ అయినప్పటికీ తర్వాత తెరుకుని వెండి పతకాన్ని గెలుచుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 7వ రోజు ముగిసే సమయానికి భారత్ మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 15 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
రజత పతకం సాధించిన అనంతరం మురళీ శ్రీశంకర్ తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ, తాను స్వర్ణ పతకం కోసమే ప్రయత్నించానని, అయితే రజతం సాధించడం మరియు 2022 కామన్వెల్త్ గేమ్స్ నాటి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Also Read:చైనా తీరుపై ట్రంప్ అసంతృప్తి!

