ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు

5
- Advertisement -

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ…అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో రౌండ్ వైమానిక దాడులకు దిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయని… ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలు చేపట్టడం ఇది వరుసగా తొమ్మిదో రాత్రి అని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

ఉత్తర ఇరాక్‌లో కూల్చివేసిన ఒక ఇరాన్ డ్రోన్‌ను నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక అమెరికా సైనికుడు మరణించి మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అమెరికా ఇరాన్‌పై ఈ తాజా దాడులను ప్రారంభించింది. ఈ దాడులు మొదలైన సమయంలోనే ఒమన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధిలో ఒక నౌకలో మంటలు చెలరేగినట్లు బ్రిటిష్ మిలిటరీ తెలిపింది. అయితే ఈ మంటలు దేనివల్ల సంభవించాయనేది స్పష్టంగా తెలియలేదు. ఇరాన్ నియంత్రణను నివారించడానికి ఓడలు ప్రయాణించాలని అమెరికా సైన్యం సూచించే మార్గంలోనే ఈ ప్రమాదం జరిగింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇటీవల మరణించిన అమెరికా సైనికుల గౌరవార్థం ఇరాన్‌పై ఈ తాజా మిలిటరీ దాడులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ కప్ ఫైనల్ ముగించుకుని వాషింగ్టన్‌కు తిరిగి వచ్చిన ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, “ఈ రాత్రి మేము వారిపై మళ్లీ చాలా గట్టిగా దాడి చేసాము. బహుశా ముగ్గురు గొప్ప దేశభక్తుల గౌరవార్థం మేము ఈ పని చేసాము అని అన్నారు.

Also Read:ఉద్ధవ్‌కు భారీ షాక్..!

సైనికుల మరణాలపై మేము చాలా బాధపడుతున్నాము అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరణించిన సైనికులు ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా నిరోధించడం కోసమే పోరాడారని ఆయన జోడించారు.

- Advertisement -