ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జట్టులో మార్పులు చేసింది టీమిండియా. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే గాయాల బారిన పడిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిల స్థానంలో రీప్లేస్మెంట్లను బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో హర్షిత్ రాణా స్థానంలో ప్రిన్స్ యాదవ్ జట్టులోకి రాగా జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్ కోసం వరుణ్ చక్రవర్తి స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ జట్టుకు ఎంపికయ్యాడు.
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా హ్యామ్స్ట్రింగ్ (తొడ కండరాల) నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత చేసిన స్కాన్లలో అతనికి ‘గ్రేడ్ 1 హ్యామ్స్ట్రింగ్’ గాయం అయినట్లు తేలింది. దీంతో అతను వన్డే సిరీస్కు దూరమయ్యాడు. తదుపరి చికిత్స మరియు పునరావాసం కోసం అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు రిపోర్ట్ చేశాడు.
ఇక వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే, అతను కూడా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లోనే హ్యామ్స్ట్రింగ్ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. స్కానింగ్ రిపోర్టులలో అతనికి ‘గ్రేడ్ 2 హ్యామ్స్ట్రింగ్’ గాయం అయినట్లు నిర్ధారణ అయింది. అతను కూడా తదుపరి చికిత్స కోసం బీసీసీఐ CoE లో చేరనున్నాడు.
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జూలై 14న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమ్ ఇండియా, ఈ వన్డే సిరీస్లో ఎలాగైనా పుంజుకోవాలని భావిస్తోంది.
Also Read:ఓ.! సుకుమారి..ఫ్యామిలీ ఎంటర్టైనర్!
భారత వన్డే జట్టు :
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.
జింబాబ్వే టీ20 సిరీస్ కోసం భారత (జట్టు):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ శెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.

