రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఏడాది విద్యాశాఖ విద్యార్థుల సౌకర్యార్థం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. వెబ్సైట్లు మొరాయించినా లేదా ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తొలిసారిగా వాట్సాప్ (WhatsApp) ద్వారా ఫలితాలను పొందే అవకాశాన్ని కల్పించారు.
వాట్సాప్ నెంబర్: 80969 58096
ప్రక్రియ: విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ను పై నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా క్షణాల్లో తమ మార్కుల జాబితాను (Memo) పొందవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో పకడ్బందీగా జరిగిన ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వాట్సాప్తో పాటు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాల విడుదల సందర్భంగా కే.కేశవరావు మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలని, ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులు అధైర్యపడకుండా త్వరలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.
మీ మొబైల్లో 80969 58096 నెంబర్ను సేవ్ చేసుకోండి.
వాట్సాప్ ఓపెన్ చేసి మీ పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ను టైప్ చేసి పంపండి.
వెంటనే మీ గ్రేడ్ పాయింట్లు మరియు సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలు మీకు అందుతాయి.

