తారిక్ రెహ్మాన్ సంచలన నిర్ణయాలు!

5
- Advertisement -

తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే, దేశ సైన్యంలో ఉన్నత స్థాయిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ (సీజీఎస్) నియామకంతో పాటు కీలక వ్యూహాత్మక కమాండ్లలో మార్పులు జరిగాయి. దేశ ప్రధాన సైనిక గూఢచారి సంస్థలో కూడా మార్పులు చోటుచేసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.

మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వ కాలంలో నియమితులైన ఉన్నత సైనికాధికారులను పక్కన పెట్టి, బంగ్లాదేశ్ సైన్యంపై తన ప్రభావాన్ని బలోపేతం చేసేందుకు తారిక్ రెహ్మాన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారని భావిస్తున్నారు.

ఇంతకు ముందు ఆర్మీ ట్రైనింగ్ అండ్ డాక్ట్రిన్ కమాండ్ (ARTDOC)లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ ఎం మైనూర్ రెహ్మాన్‌ను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించారు. ఆయన పదవీ విరమణ సెలవులోకి వెళ్లిన లెఫ్టినెంట్ జనరల్ మిజానుర్ రెహ్మాన్ షమీమ్‌కు బదులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేస్తున్న మేజర్ జనరల్ కైసర్ రషీద్ చౌధురిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ (డీజీఎఫ్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. మేజర్ జనరల్ హోదాకు పదోన్నతి పొందిన తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఉన్న మేజర్ జనరల్ మొహమ్మద్ జహంగీర్ ఆలం‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు రాయబారిగా నియమించారు.

ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ (PSO) లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమ్రుల్ హసన్ స్థానంలో ఇటీవల పదోన్నతి పొందిన లెఫ్టినెంట్ జనరల్ మిర్ ముష్ఫికుర్ రెహ్మాన్‌ను నియమించారు. హసన్‌ను విదేశాంగ శాఖకు అనుబంధించి విదేశాల్లో రాయబారిగా నియమించనున్నారు.భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో రక్షణ సలహాదారుగా పనిచేస్తున్న బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ హఫీజుర్ రెహ్మాన్‌ను వెనక్కి పిలిపించిన బీఎన్‌పీ ప్రభుత్వం, ఆయనకు మేజర్ జనరల్ హోదా కల్పించి 55వ ఇన్ఫెంట్రీ డివిజన్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా నియమించింది.

Also Read:దేవుడికి మహాపచారం..అసెంబ్లీలోనే బయటపెడతాం!

- Advertisement -