1986లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని మరుసిపోయింది హీరోయిన్ మాధురి దీక్షిత్. నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న The Great Indian Kapil Show S4 తాజా ఎపిసోడ్లో సందడి చేశారు.
షోలో కూర్చున్న సోఫాను టైమ్ మెషీన్లా మార్చేస్తూ…1986లో విడుదలైన డ్రామా చిత్రం Karma సెట్స్లో జగ్గు దాదాను మొదటిసారి చూసిన అనుభవాన్ని మాధురి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అనిల్ కపూర్ కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. ఒక పాట చిత్రీకరణ జరుగుతుండగా, జాకీ ష్రాఫ్ మరియు అనిల్ కపూర్ ఇద్దరూ తన వైపు చూస్తూ ఉండటంతో ఆ క్షణం మరచిపోలేనిదిగా మారిందని నవ్వుతూ చెప్పారు.
హోస్ట్ కపిల్ శర్మ సరదాగా “దాదా, మీ రిహార్సల్ వదిలేసి మాధురి డాన్స్ ఎందుకు చూస్తున్నారు?” అని ప్రశ్నించగా, జగ్గు దాదా తన స్టైల్లో “కభీ కభీ భిడూ, అప్నే ఆప్ కో భూల్నా పడ్తా హై” అని చమత్కరించారు. అలాగే చెట్లు నాటడం ముఖ్యమని, ప్రకృతిని కాపాడాలని సందేశం ఇచ్చారు. “తాళీ కొట్టొద్దు… వెళ్లి ఒక చెట్టు నాటు!” అని అన్నారు.
మాధురి కూడా “ఎంత ప్రేమ కథలు చేశానో, ఇప్పుడు రాయి (పథర్)తో కూడా రొమాన్స్ చేయగలను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

