కీర్తి సురేష్ ఇటీవల తమ రాబోయే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నటుడు ధనుష్తో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు.
తన సినీ ప్రయాణం గురించి ఒక పుస్తకం రాయాలని తాను ధనుష్ను కోరినట్లు ‘మహానటి’ నటి వెల్లడించింది. హాలీవుడ్, బాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా రంగంలో ధనుష్ చేసిన ప్రేరణాత్మక ప్రయాణం గురించి డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
కీర్తి చెప్పిన వివరాల ప్రకారం, ఆమె సూచనకు ధనుష్ వెంటనే నవ్వి, వినయపూర్వకమైన సమాధానం ఇచ్చారు.మన గురించి మనం పుస్తకం రాసుకుంటే, జీవితంలో మనం అన్నీ సాధించేశామని అనిపిస్తుంది అన్నారు.
ఆయన వినయపూర్వకమైన ఈ వైఖరి కీర్తిని బాగా ఆకట్టుకుంది. ధనుష్ కెరీర్ డాక్యుమెంట్ చేయదగిన అనుభవాలతో నిండి ఉందని ఆమె భావించారు. ధనుష్ నటించిన కొత్త చిత్రం తేరే ఇష్క్ మే ఈ శుక్రవారం విడుదల కానుంది.
Also Read:మోదీ సర్కారుపై కార్మిక సంఘాల నిరసన

