- Advertisement -
టీడీపీ – జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు టీడీపీ నాయకులు. రైల్వే కోడూరులో మద్యం ఏరులై పారుతుందని, ఇసుక లోడ్లలో మద్యం అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు.
వెంటనే అక్రమ మద్యం రవాణా ఆపాలని, లేకపోతే లారీలకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించారు టీడీపీ నాయకులు. చంద్రబాబుకు, టీడీపీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నడుచుకుంటే సహించేది లేదని జనసేన ఎమ్మెల్యేని హెచ్చరించారు టీడీపీ నాయకులు.
Also Read:ఇదేనా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే!
కూటమి నేతల మధ్య విభేదాల ఉన్నాయని ఇటీవలె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
- Advertisement -

