సాగునీటి ప్రాజెక్టులపై BRS పోరుబాట

7
- Advertisement -

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై మరోసారి పోరుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతోంది గులాబీ పార్టీ.

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కాళేశ్వరంపై నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడంపైన చర్చ జరగనుంది. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నాయకులకు వివరించనున్నారు కేసీఆర్.

Also Read:కేటీఆర్ ACB విచారణ..టైం పాస్:కవిత

- Advertisement -