- Advertisement -
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది ప్రభుత్వం. ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు హైదరాబాద్ ఇంచార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, TSSPDCL సీఎండీ ముషారఫ్లతో కమిటీ వేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచనలు చేయనుంది కమిటీ. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష చేయనున్నారు.
Also Read:డిక్లరేషన్ సరే..డెడికేషన్ ఏది?:హరీష్
- Advertisement -

