నాటి కేసీఆర్ ప్రభుత్వ పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గారిని ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
అనంతరం మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ ని కోరారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్ కు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహమూర్తి, కిరణ్ కుమారాచార్యులు, పీఆర్ఓ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Also Read:సిరిసిల్ల శ్రీనివాస్కు అండగా కేటీఆర్