వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

22
- Advertisement -

వీకెండ్ హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటి.. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యం అంటూ చీవాట్లు పెట్టింది.

తన ఆస్తులను అక్రమంగా కూల్చివేశారని హైకోర్టులో ఆదివారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన సామ్రెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి.

ఈ పిటిషన్ పై విచారణ చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్.. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హైడ్రాకు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

- Advertisement -