సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఏ.బి.సి.రిజర్వేషన్లు పెట్టారు అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొమ్మెర రామమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడిన రాజయ్య.. మంద కృష్ణ మాదిగ 30 ఏళ్ళు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు అన్నారు.
ఏ కమీషన్ అయినా మాదిగలకు అన్యాయం జరిగినట్లు చెప్పింది.. తాజాగా షమీమ్ అక్తర్ కమిటీ అదే రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఎస్సిలను మూడు కేటగిరీలుగా చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.. ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలన్నారు. దేని ప్రకారం ఎస్సి వర్గీకరణ చేశారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.
Also Read:కాంగ్రెస్ బీసీల వ్యతిరేకి
జనాభా ప్రకారం అయితే మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి.. అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చారు అన్నారు. బుడగజంగాలను ఏ గ్రూప్ లో కలిపారు, నేతకాని సామజిక వర్గం వారిని సి గ్రూప్ లో ఉంచారు..ఎస్సి వర్గీకరణ కేటగిరీల్లో వివేక్ వెంకటస్వామి హస్తం ఉందన్నారు.
ఖర్గే, కొప్పుల రాజు,భట్టి,వివేక్ వెంకటస్వామి లాబీయింగ్ కు రేవంత్ రెడ్డి లొంగారు.. రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నారు, ఎస్సి వర్గీకరణలో మాదిగలకు న్యాయం జరగాలి… మాదిగలు ఎన్నో ఏళ్లుగా కులవివక్ష అనుభవించారు, దామోదర రాజనర్సింహా మాదిగలకు అనుకూలంగా లేరు.. కేటగిరీలో ఉన్న
కులాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.