జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయం: యనమల

1
- Advertisement -

వైసీపీ అధినేత జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు యనమల రామకృష్ణుడు. న్సీఎల్టిలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయాడు అన్నారు. చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశాడు. వాళ్ల కుటుంబ తగాదాలు వాళ్లే రోడ్డుకీడ్చుకుని ఆ బురద మీడియాపైకి నెట్టడం హాస్యాస్పదం అన్నారు.

షర్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడివి అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 10ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒక ఆర్ధిక నేరస్తుడు 11ఏళ్లుగా బెయిల్ పై ఉండటమేమిటి అంటూ యనమల ప్రశ్నించారు.

జగన్ తీరుతో ఇప్పటికే అనేకమంది వైసీపీని వీడుతున్నారు. సురక్షిత ఆశ్రయంకోసం వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఇక భవిష్యత్ లో జగన్మోహన రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే అన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ తో ఉంటే అది ఆత్మహత్యా సదృశ్యమేనని యనమల అన్నారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి సునీత ఉసురు పోసుకున్నాడు, వాళ్ల కన్నీళ్లే వైసీపీకి శాపాలయ్యాయి. ఇప్పుడు ఏకంగా తల్లినీ, చెల్లిని ఏడిపిస్తున్నాడు. సీఎంగా గత ఐదేళ్లలో 8లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు చేశాడని జగన్ మోహన్ రెడ్డిపై యనమల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Also Read:KTR: దీపావళికి రైతులు దివాళా తీయడమేనా?

- Advertisement -