హైదరాబాద్‌లో ర్యాలీలు,ధర్నాలు నిషేధం!

1
- Advertisement -

హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని ఈ నేపథ్యంలో ధర్నాలు ,ర్యాలీల ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవాళ్టి నుండి నవంబర్‌ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని …బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

ఏక్‌పోలీస్‌ విధానం అమలు, సస్పెండ్‌ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు.

Also Read:కేటీఆర్‌పైకాంగ్రెస్ – బీజేపీ కుట్ర:సబితా

- Advertisement -