ఎన్నో అవమానాలు భరిస్తున్నా:జీవన్ రెడ్డి

0
- Advertisement -

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ బాటలో నడవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని…హత్య నిందితుడు దర్జాగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో రక్షణ పొందుతున్నాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

గత నాలుగు నెలలుగా నేను మానసిక అవమానాలకు గురవుతూ వస్తున్న…నన్ను నిర్వీర్యం చేయాలని నా మనుషులపై బౌతికంగా దాడులు చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు అన్నారు. మానసిక అవమానాలు, క్షోభకు గురి కావడమే కాకుండా భౌతికంగా కూడా నష్టపోతున్నా అన్నారు. పార్టీ ఫిరాయింపుల పర్యవసానంగా ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితిని ప్రత్యర్థులు ఆసరా చేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు.

నాకు తోడుగా నిలిచిన సహోదరులను కోల్పోయిన తర్వాత ప్రజా జీవితం, రాజకీయాల్లో కొనసాగడమనేది ప్రశ్నార్థకంగా మిగులుతోందని…నేను ఏ స్థాయిలో ఉన్నా ప్రజాసేవకు ఎప్పుడూ ముందుంటా అన్నారు. కానీ ఈ అవమానాలు భరించడం మాత్రం ఇబ్బందిగా ఉందన్నారు.

Also Read:త్వరలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు!

- Advertisement -