బీజేపీ, కాంగ్రెస్‌లది దేశంలో కుస్తీ ..తెలంగాణలో దోస్తీ!

5
- Advertisement -

రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేంద్ర సహాయ మంత్రా ?సీఎం రేవంత్ సలహాదారా ? చెప్పాలన్నారు.

రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ?, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏంటి ? ఊడితే ఏంటి ? అన్నారు. రేవంత్ సీఎం సీటులో ఉంటే ఏంటి ? ఉండకపోతే ఏంటి ?…రేవంత్ కు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్న కాంగ్రెస్ నేతలు ఎవరు ? రేవంత్ ను దించబోయే కాంగ్రెస్ మంత్రులు ఎవరో కూడా బండి సంజయ్ వెల్లడిస్తే బాగుండేదన్నారు.

మూసీ ప్రజల గోడు బీజేపీ నేతలకు పట్టదా ?,ఎన్నికలకు ముందు నిరుద్యోగుల సమస్యలపై ఒంటి కాలి మీద లేచిన బండి సంజయ్ ఇప్పుడెందుకు గర్జించడం లేదు ? అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల మీద లాఠీఛార్జ్ చేస్తుంటే రాష్ట్రం నుండి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ కి కనపడడం లేదా ?, అశోక్ నగర్ లో అప్రకటిత కర్ఫూ కొనసాగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు కిక్కురుమనడం లేదు ?, మూసీ బాధితులు నెత్తి నోరు బాదుకుంటుంటే బీజేపీ నేతలలో చలనం ఎందుకు లేదు ? అన్నారు.

అవసరం అయితే అశోక్ నగర్ వెళ్తా అంటున్న బండి సంజయ్ మాటల వెనక మర్మం ఏంటి ? ఇప్పుడు ఓట్ల అవసరం లేదనా ? ఓట్ల అవసరం ఉన్నప్పుడు వస్తా అన్నట్లా ?,రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలన నడుస్తుంది .. రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ నేతలు భేషరతుగా అనధికారిక మద్దతు ఇస్తున్నారు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది దేశంలో కుస్తీ .. తెలంగాణలో దోస్తీ అని మండిపడ్డారు.

Also Read:నల్గొండ కాంగ్రెస్‌లో వర్గపోరు..గుత్తా వర్సెస్ కోమటిరెడ్డి!

- Advertisement -