ఓటీటీలో ‘మత్తు వదలా 2’ అదిరే రెస్పాన్స్

1
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మత్తు వదలారకు సీక్వెల్ ‘మత్తు వదలరా 2’ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో నటించగా రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌ ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

రీసెంట్‌గా ఓటిటిలోకి వచ్చిన ఈ చిత్రం క్రేజీ రెస్పాన్స్ ని ఆడియెన్స్ నుంచి అందుకుంది. ముఖ్యంగా సినిమాలో మీమ్ స్టఫ్ రితీష్ రానా టేకింగ్ పై కొన్ని మైనర్ డీటెయిల్స్ సోషల్ మీడియా ఆడియెన్స్ నడుమ వైరల్ గా మారుతున్నాయి.

మొత్తంగా ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తుండగా ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో కనిపించగా కాల భైరవ సంగీతం అందించాడు.

Also Read:షర్మిల..పోస్టు కార్డుల ఉద్యమం

- Advertisement -