KTR: కరెంటు చార్జీల వంతు వచ్చేసింది

3
- Advertisement -

త్వరలో కరెంట్ ఛార్జీల పెంపుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. విద్యుత్‌ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే, పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా అంటూ ట్వీట్ చేశారు.

Also Read:చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం

- Advertisement -