Bigg Boss 8 Telugu:మణికంఠకు హ్యాండ్ ఇచ్చి నిఖిల్‌తో యష్మీ!

0
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 33 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో ఆదిత్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ-యష్మీ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆయన (ఆదిత్య) ఎంత తిట్టుకొని ఉంటారో నన్ను ప్రేరణని.. మేమిద్దరమే నామినేట్ చేశాం ఈ వీక్ అంటూ యష్మీ చెప్పింది.

తర్వాత మణికంఠను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేశారు. మా టెన్షన్‌లో మేముంటే అప్పుడు కూడా కెమెరాలన్నీ వీడి వైపే ఉండాలి అన్నట్లు మణికంఠ ఏడుపొకటి మొదలు పెట్టాడడు అని స్టార్ట్ చేయగా నబీల్ మాట్లాడుతూ అదేంటి సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా మరెందుకు బ్లాంక్ అంటూ అన్నాడు. తర్వాత సీత.. ఎందుకు నువ్వు మాటిమాటికి అందరూ నిన్ను ఓదార్చాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తావ్, సింపథీ గేమ్ ఆడుతున్నాడంటూ సీత చెప్పుకొచ్చింది.

కొద్దిసేపటి తర్వాత ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. నేను చెప్పిందే జరుగుద్ది.. జాతకం చెప్పాలి అంటూ మణికంఠను ఆదేశించాడు బిగ్ బాస్. నేను ఈ హౌస్‌లో ఒకరిని ట్రై చేస్తున్నా.. సెట్ అవుతుందా అంటూ పృథ్వీ గురించి అడిగింది విష్ణు. బిగ్‌బాస్ పంజరంలో ప్రేమ పక్షులు అంటే మీరేనమ్మా.. వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరైనా వస్తే మాత్రం మీ ప్రేమకి క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంది అంటూ విష్ణుకి చెప్పాడు .

యష్మీ జాతకం చెప్పించుకోవడానికి వెళ్లే ముందు పృథ్వీకి ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి డార్లింగ్ అంటూ పిలిచింది. తర్వాత నా పేరు లక్స్ పాప.. నేను సింగిల్‌గానే ఉండిపోతానా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా హ్యాండ్సమ్ హంక్ వస్తారా అంటూ యష్మీ అడిగింది. హంక్ అయినా నీ ముందు బంక్ అవ్వాల్సిందే… ఎందుకంటే నీది మాములు నోరు కాదు.. ఎంగిలిపడిన విస్తరాకు కూడా నీ దెబ్బకి చిరిగిపోవాల్సిందే అంటూ సెటైర్లు వేశాడు.

తర్వాత సీత వచ్చి ఇక్కడ హౌస్‌లో మణికంఠ అనే ఒకడు సావగొడుతున్నాడు సామీ.. వాడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా అంటూ సీత అడిగింది. ఈ సీజన్‌లో దరిద్రం అంటే వాడే.. వాడు ఎలిమినేట్ అవ్వాలంటే కష్టమే అన్నట్లు మణి చెప్పాడు. తర్వాత ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరు మణికంఠ జాతకం చెప్పాలని బిగ్ బాస్ కోరగా నబీల్ వచ్చి.. నువ్వు ఈ వారమే బయటికి పోతావేమోనని రేఖ కొడతాంది అంటూ సెటైర్లు వేశాడు.

Also Read:Bigg Boss 8 Telugu: మెగా చీఫ్‌గా నబీల్

తర్వాత సడెన్‌గా యష్మీని కన్ఫెషన్ రూమ్‌కి రావాలంటూ బిగ్‌బాస్ పిలిచాడు. ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మెట్స్ ఎవరు అని అడిగితే.. పృథ్వీ, నిఖిల్ అంటూ యష్మీ బదులిచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఇద్దరూ క్లోజ్ అయ్యారు.. ఒకరి పేరే చెప్పాలంటే నిఖిల్ అంటూ చెప్పింది యష్మీ. యష్మీ మీ ముందున్న క్లాత్ తీయండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. మీ ముందు ఉన్న డిషెస్‌లో నిఖిల్ వాళ్ల అమ్మ చేసిన వంట.. మణికంఠకి వాళ్ల వైఫ్ చేసిన ఇంటి వంట వచ్చాయ్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక్కడే ఓ మెలిక పెట్టాడు బిగ్ బాస్. మీరు ఆలోచించి ఎవరికి ఇంటి వంట చెందాలో ఒకరికి ఇవ్వండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

యష్మీ మాత్రం నేను వాడి (నిఖిల్) ఫ్రెండ్‌గా ఈ హెల్ప్ చేయాలి.. కనుక నిఖిల్‌కే ఇస్తా అంటూ యష్మీ చెప్పింది. తర్వాత ఫుడ్ తీసుకెళ్లి నిఖిల్ చేతిలో పెట్టి ఓ హగ్ ఇచ్చింది యష్మీ. నిఖిల్‌కి వాళ్ల అమ్మ నుంచి వచ్చిన మెసేజ్‌ను టీవీలో చూపించాడు బిగ్‌బాస్. హాయ్ నిఖిల్.. నువ్వు గెలవడానికి బీబీ హౌస్‌కి వెళ్లావు.. నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు అని సందేశం ఇవ్వగా ఇది చూసి నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు.

- Advertisement -