తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

1
- Advertisement -

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్​ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

ఈ సిట్​లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి సీనియర్​ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. సిట్​ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్​ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది.

Also Read:Bigg Boss 8 Telugu: మెగా చీఫ్‌గా నబీల్

- Advertisement -