హుజుర్‌నగర్‌కు పారిశ్రామిక శిక్షణా సంస్థ

3
- Advertisement -

హుజుర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి పై మరోమారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి మార్క్ పడింది.ఎంతో కాలం నుండి డిమాండ్ లో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐ.టి.ఐ) ని మంజూరు చేయించడంతో పాటు శాశ్వత భవన నిర్మాణానికి గాను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 14.35 కోట్లు నిధులను విడుదల చేయించారు.

ఎలక్ట్రిషియన్,ఫిట్టర్,డ్రాఫ్ట్స్ మెన్,డీజిల్ మెకానిక్ లతో పాటు వెల్డర్ కోర్సులలో శిక్షణ నిమిత్తం ప్రారంభిస్తున్న ఈ నూతన ఐటిఐ తో ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రయోజనకారిగా మారనుంది.మొత్తం ఐదు కోర్సులలో 216 విద్యార్థులతో ప్రారంభం కానున్న ఈ ఐ టి ఐ కి ప్రిన్సిపాల్ తో సహా 8 పోస్టులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పించి మంజూరు చేయించారు. గతంలో తాను మంజూరు చేయించిన అడ్వాన్డ్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో రామస్వామి గుట్ట వద్ద కొత్తగా మంజూరు అయిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ. టి.ఐ)నీ నెలకొల్ప నున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Also Read:కొండా వివాదానికి ముగింపు పలకండి:మహేశ్‌ కుమార్

- Advertisement -