మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

2
- Advertisement -

ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు మిథున్‌ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. అక్టోబర్‌ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వెల్లడించింది.

1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు మిథున్. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

Also Read:తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల

- Advertisement -