రాష్ట్రపతి ముర్ముకు ఘనస్వాగతం

1
- Advertisement -

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. సీఎంతో పాటు  మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతి తన పర్యటన సందర్భంగా, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అటవీ శాఖను ఆదేశించారు.

Also Read:తెలంగాణ భవన్ @ జనతా గ్యారేజ్

- Advertisement -