టీడీపీలోకి మంచు ఫ్యామిలీ?

5
- Advertisement -

తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ టీడీపీలో చేరనుందా? అంటే అవుననే తెలుస్తోంది. YSR కుటుంబానికి మంచు విష్ణు అల్లుడు కావడంతో గత ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీకి ప్రచారం చేశారు.

తర్వాత జగన్తో విభేదించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న భూమా మౌనిక రెడ్డి కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబుకు మోహన్ బాబు దగ్గరవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్‌యంలో ఓ లేఖ విడుదల చేశారు మోహన్ బాబు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దవం వెంకటేశ్వరస్వామి లడ్డూలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను అన్నారు మోహన్ బాబు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం,ఘోరాతి ఘోరం, నికృష్టం అన్నారు.

ఇది నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు చంద్రబాబును కోరుతున్నానన్నారు. ఆ కలియుగ దైవ ఆశీస్సులతో నా మిత్రుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలన్నారు.

Also Read:ప్రకాశ్‌ రాజ్‌, కార్తీపై పవన్ సీరియస్

- Advertisement -