ప్రకాశ్‌ రాజ్‌, కార్తీపై పవన్ సీరియస్

4
- Advertisement -

తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడిన ప్రకాశ్ రాజ్ హీరో కార్తీ పై పవన్ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మం జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో లడ్డూ వివాదం సున్నితమైన అంశం.. దాని గురించి నేను మాట్లాడను అన్నారు కార్తీ. ఇది హాస్యం చేసే అంశం కాదని వార్నింగ్ ఇచ్చారు.

ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా అమ్మవారి మెట్లు కడిగారు పవన్ కల్యాణ్. బలమైన సనాతన ధర్మాన్ని పాటిస్తా.. సెంటిమెంట్లతో ఆటలు ఆడం అన్నారు. గొడవలు చేయగలిగే సత్తా ఉంది.. నాపై విమర్శలు చేసే వారు గుర్తు పెటుకోవాలన్నారు.

అడ్డగోలుగా మాట్లాడితే క్షమించం.. పొన్నవోలు తమాషాగా ఉందా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం జోలికి రావొద్దని వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం అయితే బాధ్యత లేకుండా మాట్లాడతారా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:రెయిన్ అలర్ట్..రాష్ట్రానికి మళ్లీ భారీ వర్ష సూచన!

- Advertisement -