సుప్రీం కోర్టుకు దాసోజు, కుర్ర సత్యనారాయణ

6
- Advertisement -

తెలంగాణ గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడం పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ. హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడాన్ని తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకు వివరించనున్నారు. డాక్టర్ శ్రవణ్ వెనుకబడిన తరగతులకు చెందినవారు. సత్యనారాయణ గిరిజన వర్గానికి చెందినవారు. మా నేపథ్యాల నుండి వ్యక్తులు శాసనసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు చాలా అరుదు, ఈ సందర్భం మరింత ముఖ్యమైనది అని ఇప్పటికే శ్రావణ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గవర్నర్‌ను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించారు కూడా.

Also Read:KTR:కంపు కొడుతున్న పల్లెలు, ఇదేనా ప్రజాపాలన?

- Advertisement -