ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్

8
- Advertisement -

ఏసీబీకి మరో అవినీతి తిమింగళం చిక్కింది. నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చెందిన జాయింట్ కలెక్టర్ M.V.భూపాల్ రెడ్డి మరియు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి Rs 8,00,000 లంచం తీసుకుంటూ అ.ని.శా అధికారులకు చిక్కారు.

14 గుంటల భూమిని ధరణి పోర్టల్ లొ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు గాను సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.తదుపరి ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్ కి అందచేశారు. ఫిర్యాదుదారుని నుండి నగర శివార్లలో డబ్బు తీసుకోవటం, ఆ పై ORR దగ్గర జాయింట్ కలెక్టర్ కి అందేలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ, ACB టీమ్ రాత్రంతా ఎంతో చాకచక్యంగా అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేశారు.

Also Read:హరీష్‌ను విమర్శించే అర్హత పొన్నంకు లేదు!

జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పారు సీనియర్ అసిస్టెంట్ . ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ ,పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో మాట్లాడారు జాయింట్ కలెక్టర్ .పెద్దంఅంబర్‌పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

- Advertisement -