Sharmila:ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం లేనట్లేనా?

21
- Advertisement -

ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం అమలుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ ద్వారా స్పందించిన షర్మిల..ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి అంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీని నిలిపి వేసే కుట్ర జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.

పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? గత YCP ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయన్నారు.

దీనిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలన్నారు. పేదల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అద్భుత పథకం ఆరోగ్య శ్రీ అన్నారు. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించమని హెచ్చరించారు.

Also Read:Paris Olympics 2024 : చరిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్‌..

 

- Advertisement -