KTR: ముదిగొండ మారణహోమానికీ 17 ఏళ్లు..!

28
- Advertisement -

ముదిగొండ మార‌ణ‌హోమానికి నేటితో 17 ఏండ్లు పూర్త‌య్యాయ‌ని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని … ఖ‌మ్మం జిల్లా ముదిగొండ‌లో రైతుల‌ను, క‌మ్యూనిస్టుల‌ను పిట్ట‌ల లెక్క కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాల్చి చంపింది అని గుర్తు చేశారు.

2007, జులై 28న పేద ప్ర‌జ‌ల‌కు ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని ముదిగొండ కేంద్రంగా ధ‌ర్నా నిర్వ‌హించారు. ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న ధ‌ర్నాలో ఒక్క‌సారిగా రాబందుల అల‌జ‌డి మొద‌లైంది. అప్పటి రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:TTD:ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

- Advertisement -