హైదరాబాద్లో ఎక్కడ చూసిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేసిన కేటీఆర్..సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదు అన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయిని, డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని తెలిపారు.
చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నందని, మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
👉 హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.
👉 సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదు.
👉 బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి.
👉 డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారు.
👉 చెత్త… pic.twitter.com/hcXOiiWmBb
— KTR (@KTRBRS) July 25, 2024
Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు