Harishrao:తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గుండుసున్నా

21
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ఎగవేత నే కాదు ..ఆసెంబ్లీ సమయం పై ఎగవేత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్, బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల్లో కుదిస్తున్నారు ..కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పై రెండు రోజులే చర్చా ?ఇది దారుణం ..గతం లో కేసీఆర్ హయం లో తొమ్మిది రోజులు డిమాండ్ల పై చర్చ జరిగేదన్నారు. ప్రతిపక్షం లో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇపుడు ఎం చేస్తోంది అని ప్రశ్నించారు.

పాలక పక్షం దుర్మార్గం గా ప్రవర్తిస్తోందని…రేపటి ఎజెండా ఇంకా ఖరారు చేయలేదు అన్నారు. ఈ సాయంత్రం రేపటి చర్చ ను నిర్ణయిస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారు..నిరుద్యోగుల అంశం పై రేపు చర్చా చేపట్టాలన్నామన్నారు. తొమ్మిది అంశాలను చర్చకు ప్రతిపాదించాం, శాంతి భద్రతల వైఫల్యం ,చేనేత కార్మికుల ఆత్మహత్యలు ,గ్యారంటీలు చట్టబద్ధత ,రైతు రుణమాఫీ ఆంక్షలు ,అన్ని పంటలకు బోనస్ రైతు భరోసా ,పల్లె లు పట్టణాల్లో పారిశుధ్య లోపం స్థానిక సంస్తలకు నిధులు ,ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు ,గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు లాంటి తొమ్మిది అంశాలు చర్చను పెట్టాలని కోరాం అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదు, కాంగ్రెస్ బీజేపీ లు కలిసి తెలంగాణ కు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారు ,తెలంగాణ లో వెనుకబడిన జిల్లాలు లేవా ..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు అన్నారు. కిషన్ రెడ్డి ,బండి సంజయ్ ఏం చేస్తున్నారు ? ఎనిమిది మంది బీజేపీ ఎంపీ లు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు,తెలంగాణ కు బీజేపీ తీరని అన్యాయం చేసింది ..తెలంగాణ కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు హరీష్.

Also Read:KTR:ఏపీ,బీహార్ బడ్జెట్‌లా కేంద్రబడ్జెట్

- Advertisement -