కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన సీఎం రేవంత్

20
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చించారు. తొలి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాకు వివరించారు రేవంత్ రెడ్డి.

అలాగే కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీని క‌లిశారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీప‌ దాస్ మున్షీ.

- Advertisement -