ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు: భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

23
- Advertisement -

సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా రెండోరోజు కీలకమైన రంగం కార్యక్రమం జరిగింది. మహంకాళి అమ్మవారి భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని తెలిపారు.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాతానని…ప్రజలను చల్లగా చూస్తానని అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, భక్తులు అడిగిన సందేహాలను మాతంగి స్వర్ణలత నివృత్తి చేశారు.

ఈ ఏడాది భక్తులు 48 గంటలు వర్షంలో తడుస్తూ అమ్మ దర్శనం చేసుకున్నారని చెప్పగా.. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలని, అప్పుడే ఫలితం ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది పూజలు ఘనంగా అందుకున్నానని చెప్పారు. మరోవైపు అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Also Read:హాయ్ జగన్…వైసీపీ అధినేతతో రఘురామరాజు

- Advertisement -