- Advertisement -
ఒమన్లో విషాదం చోటు చేసుకుంది. కొమొరోస్ జెండాతో వెళ్తున్న చమురు నౌక సముద్రం మునిగిపోయింది. దీంతో నౌకలో ప్రయాణిస్తున్న 16 మంది గల్లంతయ్యారు. ఇందులో 13 మంది భారతీయ సిబ్బంది ఉండగా ముగ్గురు శ్రీలంక సిబ్బంది ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని…ఓడ మునిగిపోయి తలకిందులు కావడం వల్లే సిబ్బంది గల్లంతయ్యారని వెల్లడించారు అధికారులు. అయితే సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకయ్యాయా అన్న దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
Also Read:Harishrao:మహిపాల్రెడ్డికి ఏం తక్కువ చేశాం?
- Advertisement -